Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeFilms Newsతెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కస్తూరి

తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కస్తూరి

- Advertisement -
Google search engine

తమిళనాడులోని బ్రాహ్మణులను కాపాడే దిశగా వ్యాఖ్యలు చేస్తూ, తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని ప్రతిపక్షిస్తూ, గతంలో బ్రాహ్మణులు తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డారని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు తెలుగువారిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, 300 ఏళ్ల క్రితం వచ్చిన వారు తమది తెలుగు జాతి అంటుంటే బ్రాహ్మణులను తమిళులుగా అంగీకరించకపోవడం ఎలా అంటూ ప్రశ్నించారు.

కస్తూరి పేర్కొన్నట్లుగా, రాజుల కాలంలో తెలుగు ప్రజలు అంతఃపుర సేవ కోసం వచ్చిన వారేనని, కానీ ఇప్పుడా వారే తమను తమిళ జాతిగా భావిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

బ్రాహ్మణులు ఇతరుల ఆస్తులను ఆక్రమించవద్దని, ఇతరుల భార్యలపై ఆసక్తి చూపవద్దని చెప్పడంతోనే వారిపై ద్వేషం పెరిగిందని కస్తూరి అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందేశాల వల్లనే బ్రాహ్మణులపై తమిళనాడులో వ్యతిరేకత ఉందని ఆమె అన్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -