Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeRangareddyMaheswaramమున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి

మున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి

-

Chat on WhatsApp

128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ది పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గమును మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ కొందరు స్వార్థపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, తాన నియోజకవర్గం అభివృద్ధికై గతంలో మంజూరైన 250 కోట్ల నిధులు ఆపేశారని, ఆపేసిన స్పెషల్ ఫండ్ హెచ్ఎండిఏ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా అడిషనల్ ఫండ్ ను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తిచేశారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, బాలాపూర్ ఎమ్మార్వో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp