Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeInterNationalPetrol and Diesel | మళ్లీ షాక్.. ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎంతంటే...

Petrol and Diesel | మళ్లీ షాక్.. ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎంతంటే ?

-

Chat on WhatsApp

Petrol and Diesel: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అదనపు భారం పడింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం లీటర్ పెట్రోల్ ధరను 13.18 పాకిస్థాన్ రూపాయలు పెంచగా, హైస్పీడ్ డీజిల్ ధరను 13.80 పాకిస్థాన్ రూపాయలు పెంచింది.

సవరించిన ధరల ప్రకారం పెట్రోల్ లీటర్ ధర 310.71 పాకిస్థాన్ రూపాయలకు, డీజిల్ ధర 323.30 పాకిస్థాన్ రూపాయలకు చేరుకుంది. ఈ కొత్త ధరలు జూలై 12 నుంచి అమల్లోకి రానున్నాయి. గత వారం స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించిన ప్రభుత్వం, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మళ్లీ ధరలు పెంచింది. పెట్రోలియం విభాగం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇంధన ధరల పెంపు కారణంగా రవాణా వ్యయాలు పెరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో తాజా నిర్ణయం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp