Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeSportsIndia vs England T20 | సంజుకు మరో అవకాశం.. ఇంగ్లండ్ టీ20లో యువ ఆటగాడికి...

India vs England T20 | సంజుకు మరో అవకాశం.. ఇంగ్లండ్ టీ20లో యువ ఆటగాడికి ఛాన్స్

-

Chat on WhatsApp

India vs England T20: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే కీలక టీ20 సిరీస్‌పై పూర్తి దృష్టి సారించింది. సిరీస్ ఆరంభ మ్యాచ్‌లోనే విజయంతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌కు భారత జట్టు కూర్పులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసే అవకాశం లభించొచ్చని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన అతడికి ఈసారి తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. అతడు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఐర్లాండ్ సిరీస్‌లో విఫలమైనప్పటికీ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచినట్లు సమాచారం. అతడు ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశముంది. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు అంచనా. ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ జట్టులో కొనసాగనున్నారని తెలుస్తోంది.

బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ పేస్ బాధ్యతలు చేపట్టగా, స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగం, బ్యాటింగ్ లోతు మధ్య సమతుల్యత ఉండేలా జట్టును సిద్ధం చేసినట్లు సమాచారం.

అంచనా భారత ప్లేయింగ్ XI:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

general dhiraj seth takes charge as indian army chief of staff

General Dhiraj Seth | భారత సైన్యానికి కొత్త నాయకత్వం.. ఆర్మీ చీఫ్‌గా ధీరజ్...

General Dhiraj Seth: భారత సైన్యానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. జనరల్ ధీరజ్ సేథ్ ఈరోజు అధికారికంగా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS)గా బాధ్యతలను స్వీకరించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో జరిగిన...
- Advertisement -
Chat on WhatsApp