Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeNationalSpice Jet Boeing 737 | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీకి సేఫ్ ల్యాండింగ్

Spice Jet Boeing 737 | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీకి సేఫ్ ల్యాండింగ్

-

Chat on WhatsApp

Spice Jet Boeing 737: ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ (SpiceJet) విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ఢిల్లీకి చేరింది. SG121 నంబర్‌తో నడుస్తున్న ఈ “Boeing 737” విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమాన ప్రయాణ సమయంలో ఇంజిన్‌లో అనుమానాస్పద లోపం గుర్తించిన పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు.

ఈ ఘటనలో ఎలాంటి గాయాలు జరగలేదని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభావిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది.

కార్యకలాపాలపై మళ్లీ ప్రశ్నలు

ఈ ఘటనతో స్పైస్‌జెట్ కార్యకలాపాల విశ్వసనీయతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్త విమానాలను వెట్, డ్యాంప్ లీజుల ద్వారా చేర్చుకుంటూ, గ్రౌండ్‌లో ఉన్న విమానాలను దశలవారీగా సేవల్లోకి తీసుకురావాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయినప్పటికీ పెరిగిన ఆపరేటింగ్ ఖర్చులు, అదనపు వ్యయాల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో రూ.269.27 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

బంగ్లాదేశ్ గగనతల నిషేధం – షేర్లపై ప్రభావం

పెండింగ్ బకాయిల కారణంగా బాంగ్లాదేశ్ “Bangladesh” తమ గగనతలాన్ని వినియోగించకుండా స్పైస్‌జెట్‌కు నిషేధం విధించింది. దీంతో కోల్‌కతా నుంచి గువాహటి, ఇంఫాల్‌కు వెళ్లే కొన్ని సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సి వస్తోంది. ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో “Bombay Stock Exchange” (బీఎస్‌ఈ)లో స్పైస్‌జెట్ షేర్లు సుమారు 1 శాతం తగ్గి రూ.16.81 వద్ద ట్రేడయ్యాయి. అయితే విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం లేదని సంస్థ స్పష్టం చేసింది.

ALSO READ:Gold Silver price today | ఒక్కరోజులో భారీ పతనం.. వెండి మార్కెట్‌లో సంచలనం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp