Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeNationalAI Summit లో అద్భుతం టెక్నాలజీతో జీవం పొందిన కృష్ణార్జునులు 

AI Summit లో అద్భుతం టెక్నాలజీతో జీవం పొందిన కృష్ణార్జునులు 

-

Chat on WhatsApp

AI Summit: ఢిల్లీలో జరుగుతున్న AI Summitలో హైటెక్ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ‘కృష్ణార్జునులు’ డిజిటల్ హోలోగ్రామ్ రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిఓ ఇంటెలిజెన్స్ (Jio Intelligence) అత్యాధునిక హోలోగ్రామ్ టెక్నాలజీతో పాటు కృత్రిమ మేధ సాయంతో ఈ రూపాలను రూపొందించింది.

భారతీయ ఇతిహాసం మహాభారతంలోని(Mahabharatam) పాత్రలను ఆధునిక సాంకేతికతతో ప్రాణం ఉన్నట్టుగా చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘మహాభారత్‌: ఏక్‌ ధర్మ్‌ యుద్ధ్‌’ సిరీస్‌లోని కృష్ణుడు, అర్జునుడు తదితర పాత్రలను డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తూ, సందర్శకులు వారితో ప్రత్యక్షంగా మాట్లాడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్శకులు అడిగిన ప్రశ్నలకు ఈ డిజిటల్ రూపాలు సమాధానాలు ఇస్తుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యువతలో భారతీయ సంస్కృతి, ఇతిహాసాలపై ఆసక్తి పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. టెక్నాలజీ, సంస్కృతి కలయికగా రూపొందిన ఈ ప్రదర్శన సదస్సులో ప్రత్యేక హైలైట్‌గా మారింది.

సాంప్రదాయ కథలను ఆధునిక డిజిటల్ అనుభవంగా మలచిన విధానం భవిష్యత్తులో ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కొత్త అవకాశాలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మహాభారత్‌: ఏక్‌ ధర్మ్‌ యుద్ధ్‌’ సిరీస్ ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది.

ALSO READ:SBI CBO Recruitment 2026 | గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. SBIలో 2273 ఉద్యోగాలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Landslide hit a Tata Sumo in Himachal Pradesh's Lahaul-Spiti district.

Himachal Pradesh | హిమాచల్‌లో ప్రకృతి బీభత్సం.. టాక్సీపై విరిగిపడ్డ కొండచరియలు, పలువురు మృతి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం లాహౌల్-స్పితిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో టాటా సుమో టాక్సీ శిథిలాల కింద చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయ్‌పూర్-కిలార్...
- Advertisement -
Chat on WhatsApp