UGC Rules: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో ‘సమానత్వ కమిటీలు’ ఏర్పాటు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, వివాదాస్పద మార్గదర్శకాలకు తాత్కాలిక స్టే విధించింది.
యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు స్పష్టత లేకుండా ఉన్నాయని, వీటి వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో నిర్ణయాల అమలులో గందరగోళ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యూజీసీ కొత్త నిబంధనలను అమలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
also read:Phone Tapping Case | హైదరాబాద్లోనే విచారణకు హాజరుకావచ్చు: కేసీఆర్కు సిట్ సూచన
