Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeNationalDitva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

-

Chat on WhatsApp

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది.

రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

సముద్రంలో  అలజడి ఎక్కువ అవడంతో  మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

తుపాను ప్రభావంతో తమిళనాడులో పలు విమానసేవలు రద్దయ్యాయి. చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌పై కూడా దిత్వా ప్రభావం తీవ్రంగా కనిపించనుంది.

రాబోయే 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

general dhiraj seth takes charge as indian army chief of staff

General Dhiraj Seth | భారత సైన్యానికి కొత్త నాయకత్వం.. ఆర్మీ చీఫ్‌గా ధీరజ్...

General Dhiraj Seth: భారత సైన్యానికి కొత్త అధిపతి నియమితులయ్యారు. జనరల్ ధీరజ్ సేథ్ ఈరోజు అధికారికంగా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS)గా బాధ్యతలను స్వీకరించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో జరిగిన...
- Advertisement -
Chat on WhatsApp