Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaజస్టిస్ ప్రియదర్శిని కు సీఎం నివాళులు

జస్టిస్ ప్రియదర్శిని కు సీఎం నివాళులు

-

Chat on WhatsApp

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని మరణం రాష్ట్రానికి తీరని లోటుగా నిలిచింది. ఆమె భౌతిక కాయానికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ యాత్ర కొనసాగగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహాప్రస్థానం చేరుకుని జస్టిస్ ప్రియదర్శిని గారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె సేవలను స్మరించుకుంటూ, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జస్టిస్ ప్రియదర్శిని న్యాయ రంగానికి అందించిన సేవలు ఎనలేని మార్గదర్శకంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆమె న్యాయపరమైన అనుభవం, మానవీయ విలువలు రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరై, జస్టిస్ గారి సేవలకు నివాళులు అర్పించారు. ఆమె ఆకస్మిక మరణంతో న్యాయవర్గం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

The Tatas Web Series | వ్యాపార దిగ్గజం టాటా కుటుంబ చరిత్రతో కొత్త...

The Tatas Web Series: భారత పారిశ్రామిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన టాటా కుటుంబం జీవిత ప్రయాణం త్వరలో వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర...
- Advertisement -
Chat on WhatsApp