Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeInterNationalఅరేబియా సముద్రంలో పాకిస్తాన్ నౌకాదళ విన్యాసాలు

అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నౌకాదళ విన్యాసాలు

-

Chat on WhatsApp

పాకిస్తాన్ నావికాదళం అరేబియా సముద్ర జలాల్లో కీలక సైనిక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ విన్యాసాలు కరాచీ, గ్వాదర్ పోర్టుల సమీపంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇందులో గగనతలంలో విమానాల మధ్య జరిగే ఎయిర్-టు-ఎయిర్ లైవ్ ఫైరింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ విన్యాసాల ద్వారా పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రంగంలోకి దిగింది.

ఈ కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో విమానాలు, వాణిజ్య నౌకల రాకపోకలపై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విన్యాసాల ప్రాంతానికి దగ్గరగా రాకమని సంబంధిత యాజమాన్యాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. విమానయాన, నౌకాయాన భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రెండు రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.

విన్యాసాల్లో పాకిస్తాన్ నౌకాదళం యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించనుంది. ఆయుధాల ఉపయోగం, ప్రయోగాలను లైవ్ ఫైరింగ్ ద్వారా అంచనా వేయనుంది. విమానాల ఆధారిత క్షిపణి ప్రయోగాలతో పాటు, సముద్ర ఉపరితలంపై నుంచి కూడా ప్రయోగాలు జరపనున్నారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో ఈ విన్యాసాలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు.

ఈ విన్యాసాల ద్వారా పాకిస్తాన్ నౌకాదళం మరియు వాయుసేనల మధ్య సమన్వయం, ఆధునిక ఆయుధ వ్యవస్థల పనితీరు, యుద్ధ సన్నద్ధతపై సమీక్ష జరగనుంది. పాకిస్తాన్ భద్రతా వర్గాల ప్రకారం, ఈ విన్యాసాలు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండేందుకు మద్ధతు ఇస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp