Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeKURNOOLAdoniపెద్ద తుంబలంలో శోభాయమానంగా సీతారాముల కళ్యాణం

పెద్ద తుంబలంలో శోభాయమానంగా సీతారాముల కళ్యాణం

-

Chat on WhatsApp

ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై, భక్తిరసంలో మునిగిపోయారు.

ఈ పుణ్యకార్యక్రమంలో ఆదోని శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ పట్టణ నాయకుడు విట్ట రమేష్, డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు, శ్రీ నరసింహ ఈరన్న స్వామి, నాగరాజు గౌడ్, కే నర్సిరెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

పెద్ద తుంబలం గ్రామంలోని పోలీసు సిబ్బంది, పంచాయతీ శాఖ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

గ్రామస్థులు కుటుంబ సమేతంగా వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి, పుణ్యం పొందారు. ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp