Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టివింత

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టివింత

-

Chat on WhatsApp

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ విషయంలో లంచం తీసుకుంటూ అధికారుల చేతికి చిక్కాడు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్న అటెండర్, కుక్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.

ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు. మొత్తం రూ. 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెసింగ్ వంటి విధుల్లో అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలింది. హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులు తన పనులను వేగంగా పూర్తి చేయించుకునేందుకు లంచం ఇవ్వాల్సిందేనని ఆయన ఒత్తిడి చేసేవాడని బాధితులు ఆరోపించారు.

అతనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ సేవా సంస్థల్లో లంచం తీసుకోవడం తీవ్రమైన నేరమని, ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hundreds of snakes escape into villages after floods in china

China Floods | టైఫూన్ బీభత్సం.. పాముల ఫామ్ ధ్వంసం, వందల సంఖ్యలో పాములు...

China Floods: టైఫూన్ ప్రభావంతో చైనాలోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలతో అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, జలాశయాల ఉద్ధృత ప్రవాహం కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ పరిస్థితుల్లో మరో ఊహించని సమస్య...
- Advertisement -
Chat on WhatsApp