Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradesh64 ఏళ్ల తర్వాత కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి ప్రశ్నార్థకం

64 ఏళ్ల తర్వాత కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి ప్రశ్నార్థకం

-

Chat on WhatsApp

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండల ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 64 సంవత్సరాల క్రితం తేనే నుకయ్య ఆసుపత్రి స్థాపించబడింది. రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటనందూరు పీహెచ్సీ సిబ్బంది, డాక్టర్లు, మరియు సేవా కమిటీ సభ్యులు స్థల దాతల కుటుంబీకులను సన్మానించారు.

స్థల దాతల మనవడులు మాట్లాడుతూ తమ తాతగారు స్థలం ఇచ్చినప్పటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోటనందూరు, రౌతులపూడి మండలాలు కలిసి ఉండేవి. కానీ జనాభా పెరిగిన నేపథ్యంలో రౌతులపూడి మండలం విడిపోయి 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో కోటనందూరు ఆసుపత్రి ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానే కొనసాగడం బాధాకరమన్నారు.

ప్రభుత్వాలు మారినా ఆసుపత్రి స్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన తెలిపారు. 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సేవా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారుల సమర్ధత లేకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఆసుపత్రి అభివృద్ధి జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోటనందూరు సిహెచ్ఎన్ రాజమణి, పీహెచ్ఎన్ నరసమ్మ, హెల్త్ విజిటర్లు విజయకుమార్, రాంబాబు, ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, అల్లూరి సీతారామరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోటనందూరు ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp