HomeAndhra Pradeshదళిత భూముల ఆక్రమణపై చర్యలు కోరుతున్న బాధితులు

దళిత భూముల ఆక్రమణపై చర్యలు కోరుతున్న బాధితులు

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కోత వేటు దూరంలోని పెద్ద బండపల్లి, ఎం ఆర్ నగర్ ప్రాంతాల్లో దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకున్న చుక్క శ్రీదేవిపై కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తాత, తండ్రుల కాలంలో ఇచ్చిన భూములను లాక్కొంటూ అన్యాయానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 20 ఎకరాల మెట్టుపల్లాన్ని ఆక్రమించుకున్న చుక్క శ్రీదేవి, దళితులను తరిమి కొడుతూ భూములను బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు. పట్టలేనన్ని అక్రమాలు ఆమె చేస్తున్నారని, విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరుతున్నారు.

దళితుల ఇళ్లలోకి అక్రమంగా చొరబడి, వారిపై దాడులకు తెగబడుతున్న చుక్క శ్రీదేవి కొంతమంది దుండగులతో కలిసి గన్‌తో బెదిరించిందని బాధితులు చెబుతున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులు దీన్ని గమనించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, దళితుల భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

KTR receiving an invitation to attend Bathukamma celebrations in Dubai as chief guest.

KTR | గల్ఫ్ గడ్డపై బతుకమ్మ సందడి.. ముఖ్య అతిథిగా కేటీఆర్!

KTR: తెలంగాణ సంస్కృతికి దుబాయ్ వేదికగా మరోసారి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ తెలంగాణ...
- Advertisement -
Chat on WhatsApp