Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaSiddipetకొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

కొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

-

Chat on WhatsApp

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో ఓ అఘోరి వీరంగం సృష్టించాడు. ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడం, అక్కసుతో రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడం కలకలం రేపాయి. ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్ధితిని నియంత్రించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఘటనను పరిశీలించారు. అఘోరి చేస్తున్న అరాచకాలకు భక్తులు భయపడుతున్నారని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అఘోరి పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యక్తిపై దాడి, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం, శాంతిభద్రతల భంగం కింద నేరపత్రిక నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ ఘటన ఆలయ భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. భక్తుల రక్షణ కోసం ఆలయం వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, అఘోరి గత రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp