Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeUncategorizedయుజ్వేంద్ర చాహల్ ఘాటైన కౌంటర్‌, ధనశ్రీ ఆరోపణలు అవాస్తవమన్న స్పష్టీకరణ

యుజ్వేంద్ర చాహల్ ఘాటైన కౌంటర్‌, ధనశ్రీ ఆరోపణలు అవాస్తవమన్న స్పష్టీకరణ

-

Chat on WhatsApp

ముంబై, అక్టోబర్ 8:
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma) చేసిన సంచలన ఆరోపణలపై ఘాటుగా స్పందించాడు. ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ, “పెళ్లయిన రెండో నెలలోనే అతడిని మోసం చేస్తున్నట్టు పట్టుకున్నాను” అని చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై చాహల్ తొలిసారిగా బహిరంగంగా స్పందిస్తూ, “ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, కేవలం ఫేమ్ కోసం నా పేరుని వాడుకుంటోంది” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించాడు.

ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ తన మనసులోని మాట బయటపెట్టాడు. “నేను ఒక క్రీడాకారుడిని, మోసం చేయడం నా స్వభావంలో లేదు. ఒకవేళ పెళ్లయిన రెండో నెలలోనే మోసం చేసి ఉంటే, ఆ బంధం ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది? నా జీవితంలో ఆ చాప్టర్‌ ఎప్పుడో ముగిసిపోయింది. నేను ముందుకు సాగిపోయాను. అందరూ అదే చేయడం మంచిది” అని చాహల్ స్పష్టంగా పేర్కొన్నాడు.

ఇంకా చాహల్ మాట్లాడుతూ, “కొంతమంది ఇంకా గతాన్నే పట్టుకుని బతుకుతున్నారు. నేను గతాన్ని వదిలేశాను, కానీ వాళ్లు మాత్రం అదే విషయాన్ని పట్టుకుని ప్రతి రోజు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ నా పేరు మీదే వాళ్ల ఇల్లు నడుస్తోంది. వాళ్లు అలా కొనసాగించవచ్చు, కానీ నాకు ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ అంశంపై ఇదే నా చివరి స్పందన” అని ఘాటుగా అన్నాడు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వదంతులు వాస్తవం కావని, తన జీవితంలో సత్యం తెలుసుకునే వాళ్లు ఉన్నారని, అందుకే తాను ప్రశాంతంగా ఉన్నానని చెప్పాడు.

ధనశ్రీ వర్మ ఆరోపణల నేపథ్యం:
ప్రస్తుతం “రైజ్ అండ్ ఫాల్” (Rise and Fall) అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ధనశ్రీ వర్మ, తన వైవాహిక జీవితంపై ఓ ఎపిసోడ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి కుబ్రా సైట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె, “పెళ్లయిన రెండో నెలలోనే అతడిని మోసం చేస్తూ పట్టుకున్నాను. అదే నా వివాహం ముగిసిన క్షణం” అని చెప్పింది. ఇది యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించినదేనని అభిమానులు భావించారు.

తెలియజేసుకోవలసినది ఏనంటే, చాహల్ మరియు ధనశ్రీ 18 నెలలుగా విడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, మార్చి 20న అధికారికంగా విడిపోయారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతామని అప్పట్లో ప్రకటించారు.

ప్రస్తుతం చాహల్ తన ఆట, ఫిట్‌నెస్, వ్యక్తిగత జీవితంపై పూర్తి దృష్టి సారించాడని, సోషల్ మీడియాలో కూడా ఎటువంటి వివాదాలకు దూరంగా ఉంటున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp