Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeOthersమారుతీ సుజుకి ఎలక్ట్రిక్ SUV లాంచ్‌ కు సిద్దం

మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ SUV లాంచ్‌ కు సిద్దం

-

Chat on WhatsApp

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి, ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ SUV (ఈవీఎక్స్) ను మార్కెట్‌లోకి త్వరలో విడుదల చేయనుంది. ధర రూ.25 లక్షల వరకు ఉండనుంది.

ఈవీ కార్లకు చార్జింగ్ వసతులు కల్పించడం కీలక సమస్యగా మారుతుండగా, మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 25 వేల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.

మారుతి సుజుకి 5,100 పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నప్పటికీ, పెట్రోల్ బంకుల వద్ద ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది.

ప్రతి సర్వీస్ సెంటర్‌లో కనీసం రెండు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం మారుతి ప్రణాళికలు రూపొందిస్తోంది. చార్జింగ్ పాయింట్ల కోసం ప్రత్యేక బేలు ఏర్పాటు చేస్తోంది.

బెంగళూరులోని మారుతి సుజుకి సర్వీస్ మెకానిక్‌లకు ఈవీ కార్ల చార్జింగ్, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. చార్జింగ్ స్టేషన్లకు మౌలిక వసతులు కల్పించే పనిలో ఉంది.

కేంద్ర చమురు సంస్థలతో చర్చలు జరిపి పెట్రోల్ బంకుల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను రిజర్వ్ చేయమని మారుతి సుజుకి సూచించింది.

మారుతి సుజుకి ప్రారంభ మూడు నెలల్లోనే 3,000 ఈవీఎక్స్ SUV లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంపెనీకి కొత్త స్థాయి విజయాలను తెచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, కొత్త SUV కి భారీ డిమాండ్ ఉందని, మార్కెట్‌లో దూసుకుపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp