Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeTelanganaతెలంగాణలో డెంగీ కలకలం: కేసులు రోజురోజుకూ పెరుగుతోన్నా

తెలంగాణలో డెంగీ కలకలం: కేసులు రోజురోజుకూ పెరుగుతోన్నా

-

Chat on WhatsApp

తెలంగాణలో డెంగీ కేసులు అధికమవుతున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలు, మరియు హైదరాబాద్ పరిధిలో డెంగీ జ్వరాల తీవ్రత పెరుగుతోంది.

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ఇప్పటికే 160 కేసులు నమోదు అయ్యాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

డెంగీ ప్రధానంగా దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం. అధిక జ్వరంతో పాటు, తలనొప్పి, దద్దుర్లు, నలత, రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి.

వైద్య నిపుణులు సూచిస్తున్న ప్రధాన జాగ్రత్తలు:

  • వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకోవాలి.
  • తగిన సమయంలో వైద్యం తీసుకోవాలి.
  • ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.
  • దోమల నివారణకు ఫోగింగ్, లిక్విడ్ రిపెలెంట్లు వాడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp