Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIతిరుమల లడ్డులపై దీక్ష, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పూజలు

తిరుమల లడ్డులపై దీక్ష, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పూజలు

-

Chat on WhatsApp

జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజులు దీక్షకు మద్దతుగా పాయకరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ గెడ్డం బుజ్జి దీక్షలు నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్రమైందని, జంతు కొవ్వుతో నెయ్యి తయారీకి సంబంధించి పవన్ కళ్యాణ్ దీక్షను కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కోటఉరట్ల మండలం సుంకపూరు గ్రామం శివాలయంలో జనసేన ఇంచార్జ్ గెడ్డం బుజ్జి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజలు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటాయని, పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో దీక్షలు జరుగుతాయని గెడ్డం బుజ్జి చెప్పారు.

హైదరాబాద్ పాండురంగ దేవాలయంలో ఇప్పటికే జనసేన సైనికులు దీక్షలు మొదలుపెట్టారని ఆయన వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతు కొవ్వుతో లడ్డులు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గెడ్డం బుజ్జి డిమాండ్ చేశారు.

కోటఉరట్ల మండలం జనసేన ఇంచార్జ్ సింగంపల్లి శ్రీను, ఇతర కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళలు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పూజల్లో పాల్గొంటూ, తిరుమల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp