Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaJayashankar Bhupalpalleనాగుపాము వల్ల షార్ట్ సర్క్యూట్.. షాపు బూడిద!

నాగుపాము వల్ల షార్ట్ సర్క్యూట్.. షాపు బూడిద!

-

Chat on WhatsApp

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఒక పామే ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ అదే నిజం. టేకుమట్ల మండల కేంద్రంలోని మారుతి ఫ్యాషన్స్ బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. షాపు యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబంతో పాటు తీవ్ర ఆర్థిక నష్టంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… టేకుమట్లలోని వ్యాపారి శ్రీనివాస్ గత 14 ఏళ్లుగా మారుతి ఫ్యాషన్స్ పేరుతో బట్టల షాపు నడుపుతున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా షాపు మూసి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే రాత్రివేళ ఓ నాగుపాము షాప్ ముందున్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అది రెండు వైర్లను తాకడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్‌కు గురై చనిపోయింది. అయితే ఆ పాము ఒక వైర్‌కు చుట్టుకుని ఉండడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.

ఈ షార్ట్ సర్క్యూట్ వలన షాపులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించి అక్కడ ఉన్న అన్ని బట్టలు, ప్లాస్టిక్ సామాగ్రి, నగదు — అన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే అన్నీ నాశనమయ్యాయి.

ఘటన స్థలానికి వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్ షాక్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా వేయడంతో పాటు, షాప్ ముందు ఉన్న విద్యుత్ స్తంభంపై చనిపోయిన నాగుపాము దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు తెలిపారు. పాము రెండు తారల మధ్య తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంతో పాటు శ్రీనివాస్ కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుదేలైంది. గత 14 ఏళ్లుగా శ్రమించి కూడగట్టిన సంపద ఒక్క రాత్రిలోనే బూడిదమైంది. శ్రీనివాస్ తన బాధను తెలియజేస్తూ “బట్టల షాపు మా జీవనాధారం, ఇప్పుడు మేము వీధిన పడ్డాం” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అతని కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

ప్రజలు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని దయచేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, శ్రీనివాస్‌కు కొంత ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రకృతి ప్రమాదం అయినా, దీనికి కారణమైన నాగుపాము వల్ల ఈ విధమైన భారీ నష్టం జరగడం దురదృష్టకరం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp