West Bengal: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషాదాన్ని నింపింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ వ్యాన్ లెవల్ క్రాసింగ్(School Van Accident) వద్ద రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
School Van Accident | పాఠశాలకు వెళ్తుండగా పెను విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
-








