Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeNationalGujarat | ATS ఆపరేషన్ సక్సెస్.. జైషే-ఎ-మహమ్మద్ లింకులపై ఐదుగురు అరెస్ట్

Gujarat | ATS ఆపరేషన్ సక్సెస్.. జైషే-ఎ-మహమ్మద్ లింకులపై ఐదుగురు అరెస్ట్

-

Chat on WhatsApp

దేశ భద్రతకు ముప్పుగా మారేలా ఉగ్రవాదులు రచించిన కుట్రను గుజరాత్(Gujarat) యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) అడ్డుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఎ-మహమ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్‌ బృందాలు పలు జిల్లాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి.

ఈ సందర్భంగా బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడియవాల్ అలియాస్ మహమ్మద్ ఖాదియాసన్, మహమ్మద్ షఫీ ముఖీ అలియాస్ షఫీ చాపీ, మహమ్మద్ హసన్ కరాడియా అలియాస్ హసన్ హైదర్‌పురి, మహమ్మద్ అయూబ్ సునసారా అలియాస్ మహమ్మద్ ఖలీ పేర్లతో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తులు నిషేధిత సంస్థతో ఎలాంటి సంబంధాలు కొనసాగించారు, వారి లక్ష్యాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న వ్యక్తులు, ఇతర అనుబంధాలపై కూడా భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి. దేశంలో ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా సంస్థలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Prime Minister Narendra Modi addressing a public event in Chandigarh

TB-Free Mission India | టీబీకి చెక్.. దేశానికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ

TB-Free Mission India: దేశాన్ని క్షయవ్యాధి (టీబీ) రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం...
- Advertisement -
Chat on WhatsApp