TMC MLAs: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన కీలక టీఎంసీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ భవిష్యత్ వ్యూహం, నాయకత్వంపై విశ్వాసం, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెంపొందించేందుకు నిర్వహించిన సమావేశంలో మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో సుమారు 70 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంతో టీఎంసీలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
అయితే ఈ ప్రచారాలను టీఎంసీ నేతలు ఖండించారు. సమావేశానికి రాలేని ఎమ్మెల్యేలు ముందుగానే సమాచారం ఇచ్చారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం టీఎంసీలో అసంతృప్తి పెరుగుతోందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.








