IND VS SOUTH AFRICA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో శతకం నమోదు చేసిన కోహ్లీ, రెండో మ్యాచ్లో కూడా కేవలం 90 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
ALSO READ:CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్
దీంతో తన వన్డే కెరీర్లో 53వ శతకాన్ని సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (14), యశస్వి జైస్వాల్ (22) త్వరగానే వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్తో కలిసి స్కోరింగ్ రేటును పెంచి జట్టుకు బలమైన స్థితి తీసుకువచ్చాడు.
ఇక మరోవైపు, తొలి మ్యాచ్లో (8 పరుగులు) విఫలమైన రుతురాజ్ గైక్వాడ్ రెండో వన్డేలో అద్భుత ప్రతిభ చూపించాడు. కేవలం 77 బంతుల్లోనే 12 బౌండరీలు, 2 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. ఇది రుతురాజ్ వన్డేలలో తొలి శతకం కావడం విశేషం.
ప్రొటీస్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ జట్టు ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. కోహ్లీ–రుతురాజ్ భాగస్వామ్యం భారత్కు పెద్ద స్కోరు సాధించే పరిస్థితులను సృష్టించింది.









