Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadMatangi Swarnalatha | రెండేళ్లుగా మాట నిలబెట్టలేదు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మవారు

Matangi Swarnalatha | రెండేళ్లుగా మాట నిలబెట్టలేదు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మవారు

-

Chat on WhatsApp

Matangi Swarnalatha: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ప్రధాన ఆకర్షణగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత(Matangi Swarnalatha) అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనగా, వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో రంగం కార్యక్రమాన్ని వీక్షించి ఆశీస్సులు పొందారు. భవిష్యవాణిలో అమ్మవారు తనకు విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నేను సంతోషంగా రాలేదు.. ఆగ్రహంతో వచ్చాను. రెండేళ్లుగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నా, ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. అయినా మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను కాపాడుతున్నాను. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు” అంటూ హెచ్చరించారు. మరో ఆరు నెలల్లో తన విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని అమ్మవారు హెచ్చరించారు. తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని అమ్మవారు భవిష్యవాణిలో వెల్లడించినట్లు భక్తులు విశ్వాసంతో స్వీకరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Pawan Kalyan Congratulates Team India for Winning 39 Medals at Commonwealth Games 2026

Pawan Kalyan | 39 పతకాలు.. ఒకే త్రివర్ణ పతాకం.. టీమ్ ఇండియాకు పవన్...

Pawan Kalyan: కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై చాటారు. 39 పతకాలతో భారత్ విజయవంతమైన ప్రయాణాన్ని ముగించగా, ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...
- Advertisement -
Chat on WhatsApp