Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఉగాదికి పల్లెబాట.. వైసీపీ బలోపేతానికి జోగారావు పిలుపు

ఉగాదికి పల్లెబాట.. వైసీపీ బలోపేతానికి జోగారావు పిలుపు

-

Chat on WhatsApp

వచ్చే ఉగాది నుంచి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి కార్యకర్తను కలిసిపార్వీ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధిని పరిశీలించి, అందరి అభిప్రాయాలను వినడం ప్రధాన లక్ష్యమని అన్నారు.

సీతానగరం మండలంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల వద్దకు వెళ్లి పార్టీ వైఫల్యాలను అర్థం చేసుకుని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఈ పల్లెబాట కార్యక్రమం ఉండాలని తెలిపారు.

పార్టీ ఓటమి అనంతరం చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, కానీ కార్యకర్తల ఐక్యతే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని జోగారావు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఒకతత్వాన్ని కొనసాగిస్తూ, గ్రామాలలో తిరిగి జనాదరణను పెంచుకునేలా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలిపే విధంగా ఉగాది తర్వాత పల్లెబాట కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp