అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. దేశంలోని ఐకానిక్ ‘ట్రంప్ టవర్స్’ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ట్రంప్ బ్రాండ్ భారత్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించనుంది.
ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా నగరాల్లో ఈ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ట్రంప్ కుమారులు ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ టవర్స్ భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
భారత్ అమెరికా వెలుపల అత్యధిక ట్రంప్ టవర్స్ ఉన్న దేశంగా నిలవబోతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్లు, అత్యాధునిక సదుపాయాలతో ఈ టవర్స్ భారతీయ ఖరీదైన ఆస్తుల మార్కెట్లో భారీ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి.
ఈ పర్యటనతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక మార్పులు రావచ్చని వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ కుటుంబం భారత్లో తమ బ్రాండ్ను మరింతగా విస్తరించేందుకు ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సమాచారం.
