విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తన తండ్రి మృతి చెందినట్లు మృతుని కుమార్తె తెలిపారు. గుండె నొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు సకాలంలో పట్టించుకోలేదని ఆరోపించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని సకాలంలో వైద్యం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వల్ల ఉద్రిక్తత
RELATED ARTICLES








