Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeTelanganaTelangana Jobs 2026 | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు

Telangana Jobs 2026 | తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు

-

Chat on WhatsApp

Telangana Jobs 2026: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మూడు వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 984 అధ్యాపక, బోధనేతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే సమయంలో నియామక విధానంలో కీలక మార్పులు చేస్తూ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఇకపై ఈ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మార్కులు, విద్యార్హతల్లో సాధించిన ప్రతిభ ఆధారంగానే జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు, సిఫార్సులు లేదా ఇతర జోక్యాలకు అవకాశం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నియామకాలు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయాల్లో చేపట్టనున్నారు. వీటిలో అత్యధికంగా ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో 550 పోస్టులు భర్తీ కానుండగా, ఉద్యాన విశ్వవిద్యాలయంలో 140 పోస్టులు, పశువైద్య విశ్వవిద్యాలయంలో 294 పోస్టులకు నియామకాలు జరగనున్నాయి.

ఇప్పటికే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ, కొత్త ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్వ్యూలను తొలగించి సవరించిన నియామక విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, పరీక్షల షెడ్యూల్‌ను ఆయా విశ్వవిద్యాలయాలు త్వరలో వెల్లడించనున్నాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ప్రతిభకు ప్రాధాన్యం పెరగడంతో అర్హులైన అభ్యర్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని, నియామకాల్లో పారదర్శకత మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

125 year old gurdwara demolished in pakistan sparks india protest

పాకిస్థాన్‌లో 125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. భారత్ తీవ్ర ఆగ్రహం

Sri Guru Singh Sabha Sahib: చారిత్రక ప్రాధాన్యం ఉన్న 125 ఏళ్ల గురుద్వారాను పాకిస్థాన్‌లో కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఫరూఖాబాద్...
- Advertisement -
Chat on WhatsApp