HomeTelanganaCM Revanth Reddy | రాష్ట్ర ఆదాయం పెంపుపై సీఎం ఫోకస్.. AI ఆధారిత GST సంస్కరణలు

CM Revanth Reddy | రాష్ట్ర ఆదాయం పెంపుపై సీఎం ఫోకస్.. AI ఆధారిత GST సంస్కరణలు

-

Chat on WhatsApp

CM Revanth Reddy: తెలంగాణలో ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జీఎస్టీ వసూళ్లను పెంచడంతో పాటు పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, ఉన్నతాధికారులతో కలిసి విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ అధికారులకు డేటా ఆధారిత విశ్లేషణలు అందించే AI వ్యవస్థను అభివృద్ధి చేసి, పన్ను లీకేజీలను గుర్తించి నివారించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, Ease of Doing Businessకు భంగం కలగకుండా చర్యలు ఉండాలని సూచించారు.

ముఖ్యంగా నిర్మాణ రంగంలో జరిగే పన్ను ఎగవేతను అరికట్టేందుకు మున్సిపల్, RERA, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఒకే AI ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. భారీ నిర్మాణాలు, కాంట్రాక్ట్ పనులకు అవసరమైన నిర్మాణ సామగ్రి, పన్ను అంచనాలను అనుమతుల దశలోనే నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ డేటాను మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి వంటి సేవలతో అనుసంధానిస్తే పాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Maharashtra, Tourists rescue a youth after he slips near Malshej Ghat waterfall while taking a selfie.

Malshej Ghat waterfall | ఒక్క సెల్ఫీ కోసం ప్రాణాలపైకి.. చివరి క్షణంలో యువకుడి...

Maharashtra: సెల్ఫీ కోసం చేసే చిన్న నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్‌(Malshej Ghat waterfall)లో జరిగిన ఘటన మరోసారి గుర్తుచేసింది. క్షణాల్లో విషాదంగా మారాల్సిన సంఘటన, అక్కడున్న పర్యాటకుల...
- Advertisement -
Chat on WhatsApp