Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeEducation Newsసావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్న ఉపాధ్యాయులు

సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్న ఉపాధ్యాయులు

-

Chat on WhatsApp

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె త్యాగాలను స్మరించుకున్నారు. తెలుగు పండితుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల చదువుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి నిరుపమానమని కొనియాడారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ను “చదువుల తల్లి”గా సత్కరించి, విద్యార్థులు వారి సేవలను స్మరించి, తదనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారి త్యాగాల వల్ల మహిళల విద్యావ్యాప్తి సాధ్యమైందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులు రాధిక, శ్రీమతి రిజ్వాన, నుజత్ సుల్తానా, సాయిరాలను సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు సుజాతుల్ల, ఉపాధ్యాయులు దీకొండ విజయ్ కుమార్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp