Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకుప్పం ఎన్నికలపై తప్పుడు ప్రచారంపై టిడిపి నేతల ఆవేదన

కుప్పం ఎన్నికలపై తప్పుడు ప్రచారంపై టిడిపి నేతల ఆవేదన

-

Chat on WhatsApp

కుప్పం పురపాలక సంఘం ఎన్నికలలో గెలుపోటములు సహజమని, అయితే ఓడినవారు గెలిచినవారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమని టిడిపి సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్ అన్నారు. కుప్పం పట్టణంలో జరిగిన టిడిపి సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. గోపీనాథ్ మాట్లాడుతూ, 16వ వార్డు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడు హర్ష ధర్మతేజ టిడిపి తరపున పోటీ చేయగా, వైసిపి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ పోటీ చేశారని చెప్పారు. అయితే తాను ఓటమిని స్వీకరించినా, డబ్బు తీసుకుని వెనుకడుగు వేసినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.

గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి అభ్యర్థి గెలుపుకు తాను సహకరించినట్టు వస్తున్న వార్తలు అసత్యమని, తన కుమారుడి తరపున నిబద్ధతతో పోటీ చేశానని అన్నారు. అయితే కొంత మంది అసత్య ప్రచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసి తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.

డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ, తాను గోపీనాథ్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నానని, వారిద్దరి మధ్య ఎటువంటి వైషమ్యం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో గెలిచిన తనపై డబ్బు ఎర చూపి గెలిచాననే ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. వైద్యుడిగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో తనను ప్రజలు గెలిపించారని, ఎవరితోనూ డబ్బు వ్యవహారాలు లేవని పేర్కొన్నారు.

కుప్పం మున్సిపల్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని డాక్టర్ సుధీర్ అన్నారు. రాజకీయ లబ్ది కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన చర్య కాదని, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

central government clarifies on e25 ethanol blended petrol rollout in india

E25 petrol | E20 తర్వాత E25 వస్తుందా?.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది

E25 petrol: దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(E25 petrol)ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ25 పెట్రోల్‌ను అమల్లోకి తీసుకురావాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని...
- Advertisement -
Chat on WhatsApp