Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshటీటీడీకి హైకోర్టులో ఊరట, అర్చకుడి పిటిషన్‌ కొట్టివేత

టీటీడీకి హైకోర్టులో ఊరట, అర్చకుడి పిటిషన్‌ కొట్టివేత

-

Chat on WhatsApp

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా తనను బదిలీ చేయాలని పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. టీటీడీ పాలనాపరమైన అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే, అక్కడే ఉద్యోగిగా విధులు నిర్వర్తించాల్సిందని శ్రీనివాస దీక్షితులుకు స్పష్టం చేసింది.

టీటీడీ పాలనలో కలుగజేసుకోవడం సబబు కాదని, ఆలయ వ్యవహారాలు దేవస్థానం పరిధిలోనే ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే, అర్చక పదవి కేటాయింపులో దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని సూచించింది.

హైకోర్టు తీర్పుతో టీటీడీకి ఊరట లభించగా, ఆలయ వ్యవహారాలపై ఇకపై అనవసరమైన చట్టపరమైన వివాదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp