Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపోలవరం పనులను పరిశీలించిన పుట్టా మహేష్

పోలవరం పనులను పరిశీలించిన పుట్టా మహేష్

-

Chat on WhatsApp

దేశానికి తలమానికంగా భావించబడే పోలవరం ప్రాజెక్టు పనులను నేడు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు విజిటింగ్‌లో భాగంగా ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.

పుట్టా మహేష్ స్పిల్‌వే, డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న కాంక్రీట్ బేస్ పనులను పరిశీలించి, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పనుల నాణ్యతపై చర్చించారు. ప్రాజెక్టు పనుల వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పనుల్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన పుట్టా మహేష్, పునరావాసం (R&R), పునఃస్థాపన పనుల ప్రగతిపై సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై అధికారులను ప్రశ్నించారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు పనులన్నీ సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ బోరగం శ్రీను, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, జంగారెడ్డిగూడెం RDO, ITDA PO, ఇతర అధికారులు, ఇంజనీరింగ్ బృందం, 7 మండలాల NDA కూటమి నాయకులు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి మరొక కీలక ఘట్టమని పుట్టా మహేష్ తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp