PM Narendra Modi: సిక్కింలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యువతతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా గ్యాంగ్టక్లో ఆయన ఈ సరదా ఆటలో పాల్గొన్నారు.
క్రీడా దుస్తుల్లో పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ, ఈ అనుభవం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్గా మారాయి.
అదే రోజు సిక్కిం గోల్డెన్ జూబిలీ వేడుకల్లో ప్రధాని పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత సమాఖ్యలో సిక్కిం చేరి ఐదు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.
మోడీ ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోలో కూడా పాల్గొని ప్రజలను అభివాదం చేశారు. యువతతో క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యకర జీవనశైలికి ప్రాధాన్యతను కూడా ఆయన తెలియజేశారు.








