Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
HomeAndhra PradeshPhonePe Scam | రూ.5,000 వస్తున్నాయి అని కాకృతి పడితే..ఇక అంతే సంగతి 

PhonePe Scam | రూ.5,000 వస్తున్నాయి అని కాకృతి పడితే..ఇక అంతే సంగతి 

- Advertisement -
Google search engine

PhonePe Scam: సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేసేందుకు  ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న “ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000(PhonePe Link ₹5,000) మీ ఖాతాలో పడతాయి” వంటి మెసేజ్‌లు మొదట నమ్మలేనట్టే ఉంటాయి.

అయితే, కొన్ని బాధితులు నిజంగానే డబ్బులు వచ్చాయని అనిపించేలా చూపించబడినందున, సైబర్ క్రైమ్(CYBER CRIME) పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ:ఇలాంటి రికార్డ్స్ మెగాస్టార్ కే  సాధ్యం…..All Time Record..ఎంతంటే ?


పోలీసుల వివరాల ప్రకారం, ఈ లింకులు “పూర్తిగా నకిలీ”. వాటిని ఓపెన్ చేస్తే మొబైల్‌లో “మాల్వేర్” చొరబడుతుంది. ఫోన్‌లోని “బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు, వ్యక్తిగత డేటా” సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళి ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

పండుగ ఆఫర్‌ పేరుతో వచ్చే ఈ లింక్‌లను “వెంటనే డిలీట్ చేయాలని”, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం లాంటి యాప్‌లు ఇలాంటి ఆఫర్లు లింక్ ద్వారా ఇవ్వవు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సన్నిహితులు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అయినా నిజమని నమ్మవద్దని, లింక్ ద్వారా డబ్బులు కోల్పోయిన చాలా కేసులు ఇప్పటికే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

మోసపోయినట్లయితే వెంటనే “1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్” కు ఫిర్యాదు చేయాలి. సమయానికి సమాచారం అందిస్తే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చని చెప్పారు.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular