Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిశాఖలో బాలయ్య పాటలతో సంగీత విభావరి సందడి!

విశాఖలో బాలయ్య పాటలతో సంగీత విభావరి సందడి!

-

Chat on WhatsApp

విశాఖపట్నంలో బాలకృష్ణ హిట్ పాటలతో నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 100 హిట్ పాటలు, 200 మంది గాయకుల గళామృతం సంగీత ప్రియులకు మధురానుభూతిని అందించింది.

బాలకృష్ణ సినిమాల సూపర్ హిట్ పాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు. “జై బాలయ్య జై జై బాలయ్య”, “సమరసింహా రెడ్డి” వంటి పాటలకు ప్రేక్షకులు స్టేజ్ మీదే డాన్స్ చేసి సందడి చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన సీపీ శంఖబ్రత బాగ్జీ మాట్లాడుతూ, “ఇంత భారీ సంగీత విభావరి నేనెప్పుడూ చూడలేదు” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ విభావరికి బాలకృష్ణపై ఉన్న అభిమానమే మూలకారణమని నిర్వాహకుడు డా. కంచర్ల అచ్యుతరావు తెలిపారు. విశాఖ కళాకారులకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. పాటల పోటీలో ఉమాప్రసాద్, జ్యోతి మొదటి బహుమతి (₹15,000), షేక్ మదీనా రాజేశ్వరి రెండో బహుమతి (₹10,000), ఎ.రాజు, సుజాత మూడో బహుమతి (₹5,000) గెలుచుకున్నారు. వీరిని సీపీ శంఖబ్రత బాగ్జీ సత్కరించారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవలో విశేషంగా నిలిచిన 10 మంది మహిళలను సన్మానించారు. కెవిఆర్ ఫౌండేషన్, ప్రియదర్శిని ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశాఖ నగరంలోని సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp