Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeTelanganaKhammamసత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి నియోజకవర్గం లో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పెనుబల్లి మండలంలో 54 లక్షల ఈజీఎస్ నిధులతో 10 కాటిల్ షెడ్లు, 33 నర్సరీలు, 10 నాడపు కంపోస్ట్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నాడపు కంపోస్ట్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

కల్లూరు మండలంలో ఒక కోటి 50 లక్షల నిధులతో కొత్త ఎర్రబోయినపల్లి గ్రామంలో 18 లక్షలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 130 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular