Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమౌనిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

మౌనిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి హైస్కూల్లో మంగళవారం 8వతరగతి విద్యార్థిని యవర్న మౌనిక అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21న నెల్లిమర్ల మండలం రఘుమండలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మౌనిక ప్రతిభ చాటింది. గతంలో మౌనిక నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. మౌనికను పీడీ చాపాన పోలమాంబను శాలువు, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, ఎంపికైన మౌనికను జయతి గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, చాపాన నారాయణరావు, మన్నెపురి అప్పలనాయుడు, ఉపాధ్యాయులు నాగమణి, టి అశోక్ కుమార్, కెపివి శ్రీనివాసరావు,సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp