Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonజనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు బోల్తా

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సు బోల్తా

-

Chat on WhatsApp

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైరు పేలి, బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలు మరియు స్వల్ప గాయాలతో ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు.

బెంగళూరు నుండి వరంగల్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో కంట్రోల్ కోల్పోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు తగలగా, 23 మందికి స్వల్ప గాయాలు తగిలాయి.

క్షతగాత్రులను వెంటనే జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది, కాగా, తీవ్రంగా గాయపడిన వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.

ప్రమాదం కారణంగా సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారి పైకి వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితిని సమీక్షించి, ఎలాంటి అవాంతరాలు లేకుండా రహదారి పై ట్రాఫిక్ సమసిపోవడానికి చర్యలు తీసుకున్నారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది, ప్రయాణికులు అందరూ భయంతో బయటపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

బద్రీనాథ్ ఆలయ విరాళాలపై ఆరోపణలు.. ఉద్యోగి సస్పెన్షన్, విచారణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం

Badrinath: ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉత్తరాఖండ్‌లో కలకలం రేపాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్...
- Advertisement -
Chat on WhatsApp