Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshKancharlapalem | కంచర్లపాలెంలో పేకాట గుట్టు రట్టు.. టాస్క్ ఫోర్స్ దాడిలో 5 మంది పట్టివేత

Kancharlapalem | కంచర్లపాలెంలో పేకాట గుట్టు రట్టు.. టాస్క్ ఫోర్స్ దాడిలో 5 మంది పట్టివేత

-

Chat on WhatsApp

 Kancharlapalem: గుంటూరు జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం రాత్రి సుమారు 11:40 గంటల సమయంలో, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచర్లపాలెం గ్రామ శివారు పొలాల మధ్య పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందింది.

ఈ సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసిన అనంతరం, టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. రాత్రి వేళ పొలాల మధ్య రహస్యంగా పేకాట సాగుతుండగా, పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వాహకుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

దాడి సమయంలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకుని, ప్రధాన నిర్వాహకుడిగా పి. శ్రీనివాసరావు (కంచర్లపాలెం)ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 5 మంది వ్యక్తులు, 5 సెల్‌ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, అలాగే రూ.6,040 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట కోసం ఉపయోగించిన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వ్యక్తులు, నగదు, ఫోన్లు, వాహనాలు తదితరాలను తదుపరి విచారణ నిమిత్తం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడైనా జూదం నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామాలు, శివారు ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను అడ్డాగా చేసుకుని ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు హెచ్చరించారు.

ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ దాడి జూదం నిర్వాహకులకు గట్టి హెచ్చరికగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp