Friday, March 6, 2026
No menu items!
Google search engine
HomeSportsIndia vs England T20 semifinal | ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా రికార్డ్ ఇలా ఉంది?

India vs England T20 semifinal | ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా రికార్డ్ ఇలా ఉంది?

- Advertisement -
Google search engine

India vs England: ముంబయిలోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium) వేదికగా గురువారం భారత్–ఇంగ్లాండ్ సెమీఫైనల్-2 పోరు జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళ్తే, ఓడినవారి ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఇంగ్లాండ్‌పై గెలిచి టైటిల్ రేసులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉండగా, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ లో దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ సెమీఫైనల్-1 జరుగుతుంది. ఆ మ్యాచ్ విజేతతో ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

టీ20ల్లో భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 29 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 17, ఇంగ్లాండ్ 12 విజయాలు సాధించాయి. స్వదేశంలో భారత్ 10 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లాండ్ స్వదేశంలో 5 సార్లు విజయం సాధించింది.

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 4 మ్యాచ్‌లు గెలిచింది. తటస్థ వేదికల్లో భారత్ 3, ఇంగ్లాండ్ 1 విజయం నమోదు చేశాయి.

టీ20 ప్రపంచకప్ పోటీల్లో రెండు జట్లు ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత్ 3, ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌లు గెలిచాయి. ఇంగ్లాండ్‌పై భారత్ అత్యధికంగా 218 పరుగులు నమోదు చేయగా, కనిష్ఠంగా 150 పరుగులకు పరిమితమైంది. అదే విధంగా భారత్‌పై ఇంగ్లాండ్ గరిష్టంగా 200 పరుగులు సాధించగా, అత్యల్పంగా 80 పరుగులకే ఆల్‌ఔట్ అయింది.

ఈ గణాంకాలు భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉన్నట్టు చూపుతున్నాయి. సెమీఫైనల్‌లో విజయం సాధించి రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని టీమ్ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular