Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeCrime Newsగుర్రాల కొండ గెస్ట్ హౌస్ భూమి వివాదం కోర్టులోకి

గుర్రాల కొండ గెస్ట్ హౌస్ భూమి వివాదం కోర్టులోకి

-

Chat on WhatsApp

గుర్రాల కొండపై నిర్మించిన గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది. ఈ భూమిని అసైన్డ్ భూమిగా చూపించి కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం. భూ వివాదంపై అధికారుల దృష్టి పడడంతో జిల్లా రెవెన్యూ అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే, కొండపైకి వెళ్లే మార్గంలో గేటు ఏర్పాటు చేయడంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకోలేకపోయారు. వీఆర్ఓలు వెనుతిరిగినప్పటికీ, త్వరలోనే మరింత చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. భూమి రిజిస్ట్రేషన్, గెస్ట్ హౌస్ నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టనున్నారు.

ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది. కేతిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తగిన రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు.

అదేవిధంగా, ఈ భూ వివాదంపై అధికారులు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు. భూమి హక్కులపై ఎలాంటి అక్రమాలు జరిగాయో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వానికి చెందుతుందా, లేక కేతిరెడ్డి కుటుంబానికి న్యాయబద్ధమైన హక్కులున్నాయా అనే విషయంపై హైకోర్టు తీర్పును ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp