Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakనిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

నిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

-

Chat on WhatsApp

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు.

ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చూపించిన నైపుణ్యం ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఎంతో ఆనందపరిచిందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే స్వయం పరిపాలనపై అవగాహన కలిగేలా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మిలిన ఈ వేడుక విద్యా రంగానికి మంచి ప్రేరణగా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp