Year Ender 2025: సంవత్సరం ముగింపు సందర్భంగా గూగుల్ ‘India’s Year in Search 2025: The A to Z of Trending Searches’ అనే వార్షిక రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ నివేదికలో 2025లో భారతీయులు ఎక్కువగా ఏ అంశాలను శోధించారో స్పష్టత వచ్చింది.
క్రీడలపై దేశంలో ఉన్న విశేష ఆసక్తి, కృత్రిమ మేధస్సు (AI) విస్తరణ, పాప్ కల్చర్ ప్రభావం ఈ ఏడాది శోధనలపై స్పష్టంగా ప్రతిబింబించింది.
గూగుల్ డేటా ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025లో దేశవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడిన అంశంగా నిలిచింది. మొత్తం ట్రెండింగ్ కేటగిరీల్లో ఐపీఎల్ మొదటి స్థానంలో నిలవడం, భారత క్రికెట్కు ఉన్న అభిమానాన్ని బయటపెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ:హైకోర్టులో క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ : Hydra Commissioner
AI సంబంధిత శోధనలు కూడా గణనీయంగా పెరిగాయి. టెక్నాలజీ, సినిమా, రాజకీయం, వినోదం, జాతీయ ఈవెంట్లపై ఉత్సుకతతో భారతీయులు గూగుల్లో విస్తృతంగా సమాచారాన్ని వెతికినట్లు రిపోర్ట్ సూచిస్తుంది.
ఈ వార్షిక డేటా భవిష్యత్ డిజిటల్ ట్రెండ్స్, ప్రజల ఆసక్తులు, మరియు భారత్లో మారుతున్న శోధన అలవాట్లను అర్థం చేసుకోవడానికి కీలక సూచనలుగా నిలుస్తోంది.








