Gold Prices Today: కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రూపాయి-డాలర్ మారకం విలువల్లో హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాజా ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర పెరగగా, వెండి కూడా స్వల్పంగా ఖరీదైంది.
తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,470కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,510కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,35,100గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఒకే స్థాయిలో కొనసాగుతుండగా, వెండి ధర కిలోకు రూ.2,34,900గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,620, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,660కు విక్రయమవుతోంది.
అక్కడ కిలో వెండి ధర రూ.2,35,100గా ఉంది. ముంబైలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,43,470, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,510గా కొనసాగుతుండగా, వెండి ధర రూ.2,35,100గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ బలపడటం వంటి అంశాలను బట్టి రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ: కుండపోతకు కుదేలైన ఉత్తరాది.. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలకు బ్రేక్








