Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakగ్యాస్ సిలిండర్ పేలుడుతో పూరి గుడిసె దగ్ధం

గ్యాస్ సిలిండర్ పేలుడుతో పూరి గుడిసె దగ్ధం

చిన్న శంకరంపేట మండలం పేట ప్యాటగడ్డ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాములు కుటుంబానికి చెందిన పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శ్రీకాంత్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుడిసె పూర్తిగా దగ్ధమవడంతో ఆ కుటుంబం పూర్తిగా వీధిన పడింది.

బాధిత కుటుంబ సభ్యులు వివరిస్తూ, ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటిలోని బట్టలు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంలో నాలుగు లక్షల రూపాయల నగదు, ఐదు తులాల బంగారం, ఇరువై తులాల వెండి పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. దీనితో పాటు, 10 క్వింటాళ్ల బియ్యం, భూమి పాస్ పుస్తకాలు, ఆటో ఆర్‌సి పత్రాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి.

గుడిసె పూర్తిగా కాలిపోయి, బట్టలతో మాత్రమే బయటకు వచ్చిన కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నామని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ ఆర్థిక సహాయం లేకుండా వీధుల్లో నివసిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ ఘటన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది. దగ్ధమైన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబం మళ్లీ జీవితాన్ని గాడిలో పెట్టుకోవడానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular