మహారాష్ట్రలోని అంబర్నాథ్(Ambernath)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు(Driver Heart Attack) రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై విరుచుకుపడింది. కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది.
ఈ భయంకర ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ:Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480 కోట్ల మంజూరు
దుర్ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ కాలు యాక్సిలరేటర్పై ఇరుక్కుపోవడంతో కారు వేగం మరింత పెరిగిందని పోలీసులు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వాహనాలను క్రేన్ సాయంతో తొలగించి ట్రాఫిక్ను సవ్యంగా నడిపించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అంబర్నాథ్ పోలీసులు తెలిపారు.
