CPI నారాయణ వివిధ జాతీయ, రాష్ట్ర అంశాలపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ, అమెరికా–ఇజ్రాయెల్ చర్యలు ఇరాన్పై యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు.
ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే క్రమంలోనే ప్రతిస్పందిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముందడుగు వేసి అంతర్జాతీయ సమన్వయంతో చర్చలు జరపాలని కోరారు.
రాష్ట్ర సమస్యలపై స్పందిస్తూ భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ధార్మిక సంస్థల్లో కఠిన విధానాలు అమలు చేస్తే లడ్డూ కల్తీ వంటి ఘటనలు నివారించవచ్చన్నారు.
నిజాయితీగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎవరు హాని చేయలేరని, చిన్న తప్పిదాలుజీవితాన్ని ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించారు. కాకినాడ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, కల్తీ పాలు, డెయిరీ నియంత్రణపై ప్రశ్నించారు.
నక్సలిజం సమస్య పేదరిక నిర్మూలనతోనే పరిష్కారమవుతుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, సీబీఐ కేంద్ర అధీనంలో పనిచేస్తోందని విమర్శించారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల నుంచి నిధులు విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మధ్యవర్తిత్వం చేయాలని కోరారు.









