బెంగళూరులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ప్రతిష్టాత్మక ఎయిర్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది.
ఈ ఎయిర్ షోలో 90 దేశాల నుంచి 150కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో సుమారు 900 వైమానిక విన్యాసాలు జరుగనున్నాయి. వాణిజ్య, యుద్ధ విమానాల నూతన నమూనాలు, అత్యాధునిక రక్షణ సాంకేతికతలు ప్రదర్శించబడుతున్నాయి.
అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాల రక్షణ సంస్థలు పాల్గొన్నాయి. ఎఫ్-16, రాఫెల్, సుఖోయ్, మిరాజ్ వంటి యుద్ధ విమానాల విన్యాసాలు హైలైట్గా నిలవనున్నాయి. పౌర విమానయాన, రక్షణ రంగంలో ఉపయోగపడే అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు కూడా ప్రదర్శనలో ఉంచబడ్డాయి.
ఈ ఎయిర్ షో భారత్కి రక్షణ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే గొప్ప అవకాశంగా మారనుంది. భారత్లో తయారీదారులకు, అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిలుస్తున్న ఈ ప్రదర్శన దేశ వైమానిక శక్తిని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది.